హైదరాబాద్ నగరంలో భక్తి, శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పండుగను పురస్కరించుకుని నగరంలోని ప్రజలు పెద్దఎత్తున వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి నగరంలో పండుగ మూడ్ నెలకొననుంది.
ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ నిమజ్జనాన్ని సెప్టెంబర్ 6న నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్సాగర్తో పాటు ఇతర నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గణనాయకుడిని ఘనంగా వీడ్చేందుకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.
నగరంలోని ప్రధాన కూడళ్లు, కాలనీలు, బస్తీలు ఇలా అన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతి విగ్రహం చుట్టూ ప్రత్యేకంగా అలంకరణలు, శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ శోభ పెంచనుంది. యువత పెద్దఎత్తున ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమవుతోంది.
భద్రత, ట్రాఫిక్ నియంత్రణ విషయంలో నగర పోలీసులు, మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిమజ్జన రోజున ట్రాఫిక్ డైవర్షన్లు, సీసీ టీవీ పర్యవేక్షణ, రెస్క్యూ బృందాల తగిన ఏర్పాట్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు శాంతి సమాధానాల మధ్య పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa