ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3 దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న 4 పాములు

international |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 09:00 PM

ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ కలిగిన దేశాల్లో ఇండియా ఒకటి. ఇక్కడి విస్తారమైన భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, వివిధ పర్యావరణ వ్యవస్థలు.. అనేక జంతుజాతులకు నెలవుగా మారాయి. ముఖ్యంగా పలు రకాల పాములకు అనువైన ప్రాంతంగా.. భారత్ ఉంది. అందులో నాలుగు రకాల పాములు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మూడు దేశాలను ఈ నాలుగు రకాల పాములు ముచ్చెమటలు పట్టిస్తున్నాయట!. మరి ఆ పాము జాతులేంటి? అవి ఎంత ప్రమాదకరమో ఈ కథనంలో తెలుసుకుందాం.


బిగ్ ఫోర్..


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివరాల ప్రకారం.. భారత్‌లో కింగ్ కోబ్రా సహా 300 కంటే ఎక్కువ పాము జాతులు ఉన్నాయి. వీటిలో 95 శాతం విషపూరితమైనవి కావు. అయితే, "బిగ్ ఫోర్" (Big Four snake) జాతుల పాముల కాటు చాలా ప్రమాదకరం. ఈ "బిగ్ ఫోర్" జాతుల్లో ఇండియన్ కోబ్రా (Indian Cobra - Naja naja), కట్లపాము (Russell's Viper - Daboia russelii), రస్సెల్ వైపర్ (Russell's Viper - Daboia russelii), సా స్కేల్డ్ వైపర్ (Indian Saw-Scaled Viper - Echis carinatus) ఉన్నాయి. ఈ పాములు చాలా విషపూరితమైనవి. ప్రపంచవ్యాప్తంగా 3,000 కంటే ఎక్కువ పాము జాతులు ఉండగా, వాటిలో 600 కంటే ఎక్కువ విషపూరితమైనవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో కనిపించే నాగుపాములు చైనాలో కంటే ఎక్కువ విషపూరితమైనవట. ఈ పాముల విషం గుండె, మెదడుపై దాడి చేసి ప్రాణాలు తీస్తాయి.


  ఒక నివేదిక ప్రకారం, కింగ్ కోబ్రాలు సగటున 25 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. ఇవి ఆహారం లేకుండా కొన్నాళ్ల వరకు తట్టుకోగలవు. వీటికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. ఈ కారణంగా కరువు, ఆహార కొరత లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు వీటిపై పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు చెబుతున్నారు. ఈ నాగులు నివసించే ప్రాంతాల్లో.. వాటిని వేటాడే జంతువులు తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటికి ప్రాణాపాయం కూడా తక్కువగా ఉంటుంది. దక్షిణ చైనాలో ఎక్కువగా ఇలాంటి కోబ్రాలు కనిపిస్తాయి. చైనాతో పాటు తైవాన్, ఉత్తర వియత్నాంలో కూడా ఈ నాగు పాములు కనిపిస్తాయి. భారత్‌లో ఈ కింగ్ కోబ్రాలు 7 నుంచి 10 అడుగుల పొడవు ఉంటాయి. అయితే, చైనాలో ఉండే కోబ్రాలు మాత్రం దాదాపు 4 అడుగుల పొడవు మాత్రమే ఉంటాయి.


అత్యంత ప్రమాదకరం..


భారతదేశంలో కనిపించే నాగుపాములు.. చైనాలో కంటే ఎక్కువ విషపూరితమైనవి. భారతదేశంలో కనిపించే "బిగ్ ఫోర్" పాములలో కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైనది. దీని విషం.. గుండె, మెదడు వంటి ముఖ్యమైన భాగాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే ఇవి కాటేస్తే మంచినీళ్లు కూడా తాగనివ్వరట. ఈ పాములు న్యూరోటాక్సిక్ విషాన్ని కలిగి ఉంటాయి. ఇది నేరుగా గుండె, మెదడుపై దాడి చేస్తుంది. దీనివల్ల గుండె ఆగిపోతుంది. మెదడుకు పక్షవాతం వస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన కోబ్రాలు పాకిస్తాన్, శ్రీలంకలో కూడా కనిపిస్తాయి. చైనాలో కనిపించే కోబ్రాలు భారతీయ కోబ్రాల కంటే చిన్నవిగా ఉంటాయి. అంతేకాకుండా తక్కువ విషపూరితమైనవి. అయితే, చైనా కోబ్రాలు కూడా న్యూరోటాక్సిక్ విషం కలిగి ఉంటాయి.


మూడు దేశాలకు ముచ్చెమటలు..


భారత్‌లో ప్రతి ఏటా వీటి వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో.. ఈ బిగ్ ఫోర్ పాముల వల్ల.. 46000 నుంచి 60000 మంది మృత్యువాత పడుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. అవి ఎంత ప్రమాదకరమో. పాకిస్థాన్‌లో అనేక మంది ఈ పాముల కాటు వల్ల చనిపోయారు. ఈ నాలుగు రకాల పాములు భారత్, పాకిస్తాన్‌లో అధికంగా ఉంటాయి. ఇందులో కింగ్ కోబ్రా, మల్టీ-బాండెడ్ క్రైట్ వంటి పాములు చైనాలోని దక్షిణ ప్రాంతంలో (గ్వాంక్సి, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌ల్లో) ఉంటాయి. అయితే చైనాలో ఎంత మంది వీటి వల్ల మరణించారనే స్పష్టమైన గణాంకాలు లేవు. కానీ స్థానికంగా వీటి వల్ల ముప్పును ఎదుర్కొంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa