అష్టలక్ష్మీలలో వరలక్ష్మీదేవికి విశిష్ట స్థానం ఉందని పురోహితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతం అన్ని లక్ష్మీపూజల కంటే శ్రేష్ఠమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. సకల శుభాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కోసం పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం.వరలక్ష్మీదేవి వ్రతం చేయాలంటే ముందుగా ఉదయమే లేచి స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి. ఇంటిని మామిడితోరణాలు అలంకరించాలి. గుమ్మానికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టాలి. పసుపుతో గణపతి రూపం చేసి పూజించి, కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో పూజించి, అష్టోత్తరనామావళితో నామాలు చదవాలి. దీప, ధూపం, నైవేద్యాలు సమర్పించాలి. కర్పూర నీరాజనం తర్వాత మంత్రపుష్పం అర్పించాలి. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa