మన దేశం వ్యవసాయాధారిత దేశం.. ఎక్కువ మంది సేద్యంపైనే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. అయితే ఒకప్పుడు సంప్రదాయ సాగు విధానాలతో రైతులు సిరులు కురిపించారు. అయితే ఇప్పుడంతా టెక్నాలజీ మయం. సేద్యంలోకి కూడా సాంకేతికత ప్రవేశించింది. పండించే పంటలు కూడా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ మత్స్యశాఖ తీసుకున్న నిర్ణయం మత్స్యకార మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. మత్స్యకార మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ మత్స్యశాఖ సముద్రపు నాచు పెంపకం చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత 30 మంది మహిళలకు ఇందులో ట్రైనింగ్ ఇచ్చారు. విశాఖ తీరంలో సముద్రపు
నాచు పెంపకం ద్వారా మత్స్యకార మహిళలకు పని కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన CMFRI, CAMCRI మత్స్యశాఖ అధికారులకు కావాల్సిన సాంకేతిక సాయం అందిస్తున్నాయి.
సముద్రపు నాచు పెంపకం విధానం ఇప్పటికే తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ విధానాలను పరిశీలించిన ఏపీ మత్స్యశాఖ అధికారులు.. విశాఖ తీరంలోనూ మహిళల ద్వారా అదే విధానాలను అమలు చేస్తూ సముద్రపు నాచు పెంపకం చేపడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖ ఆర్కే బీచ్లో ఇందుకోసం రాఫ్ట్ ఏర్పాటు చేశారు. రెండు మహిళా సంఘాల సాయంతో ఈ రాఫ్ట్ వద్ద సముద్రపు నాచు పెంచుతున్నారు. త్వరలోనే మరో రెండు చోట్ల పెంపకం చేపట్టనున్నారు.
మరోవైపు సముద్రపు నాచు పెంపకాన్ని ఏ సీజన్లో అయినా చేపట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. 45 రోజుల్లోనే పంట చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. 50 కిలలో సీవీడ్ వేస్తే.. 200 కిలోల వరకూ సముద్రపు నాచు చేతికి వస్తుందని వివరిస్తున్నారు. మరోవైపు సముద్రపు నాచు కేజీ 22 రూపాయల వరకూ పలుకుతోందని చెప్తున్నారు.
50 కిలోల సీవీడ్ కోసం సుమారుగా 11 వేలు ఖర్చు అవుతుందని.. ఒక్కసారి పంటకు 42 వేల వరకూ వస్తుందని చెప్తున్నారు. సముద్రపు నాచును కేకులు, ఐస్క్రీమ్స్, బిస్కెట్లు వంటి తినే వదార్తాలతో పాటుగా ఔషధాలు, రసాయనాల తయారీలోనూ వినియోగిస్తారని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. సముద్రపు నాచులోనూ రకాలు ఉంటాయని.. జాగ్రత్తగా ఎంపిక చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa