కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్ని ప్రకటించగా.. దిగ్గజ కంపెనీలు ఇప్పటికే చాలా వరకు ధరల్ని తగ్గించేశాయి. ఇక కార్ల తయారీ కంపెనీలు అన్నింటికంటే ముందున్నాయి. చాలా త్వరగానే ఆయా మోడళ్లపై ధరల్ని తగ్గించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా ఇలా అన్నీ ఉన్నాయి. ఇక దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ దశల వారీగా ధరల్ని తగ్గిస్తోంది. ఇక్కడ జీఎస్టీ రేట్ల కోతతో పాటుగా.. ఇతర పండగ ఆఫర్లతో కలిపి ధరల తగ్గింపును ప్రకటిస్తోంది.
ఇప్పుడు మారుతీ సుజుకీ తన స్విఫ్ట్ మోడల్ కార్ల ధరల్ని తగ్గించింది. స్విఫ్ట్ విషయానికి వస్తే.. దేశంలోనే అత్యధికంగా అమ్ముడుబోయిన కార్లలో ఇదొకటి. ఇటీవల ఈ కంపెనీ స్విఫ్ట్పై వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ. 85 వేల వరకు ధరను తగ్గించింది. ఇక్కడ జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాల్ని కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందించింది.
మారుతీ స్విఫ్ట్ Lxi వేరియంట్ ధర రూ. 70 వేలు తగ్గగా ఇప్పుడు ఎక్స్ షోరూం ధర రూ. 5.79 లక్షలకు దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ. 6.49 లక్షలుగా ఉండేది. Vxi వేరియంట్ ధర రూ. 71 వేలు తగ్గి.. ఇప్పుడు దీని ధర రూ. 6.59 లక్షలకు దిగొచ్చింది. Vxi (O) వేరియంట్పై రూ. 72 వేలు తగ్గి ఎక్స్ షోరూం ధర రూ. 7.57 లక్షల నుంచి రూ. 6.85 లక్షలకు చేరింది.
>> వీఎక్స్ఐ ఏఎంటీ ధర రూ. 76 వేలు తగ్గి .. ఎక్స్ షోరూం ధర రూ. 7.30 లక్షలకు దిగొచ్చింది. Vxi (O) AMT ధర రూ. 77 వేలు తగ్గింది. Vxi CNG ధర చూస్తే రూ. 75 వేలు తగ్గడంతో ఇప్పుడు ఇది రూ. 7.45 లక్షలకు చేరింది. ZXi వేరియంట్ ధర రూ. 77 వేలు తగ్గడంతో రూ. 7.53 లక్షలకు పడిపోయింది. Vxi (O) CNG ధర రూ. 76 వేలు తగ్గి రూ. 7.71 లక్షలకు దిగొచ్చింది.
జెడ్ఎక్స్ఐ ఏఎంటీ ధర రూ. 82 వేలు తగ్గి ఎక్స్ షోరూం ధర రూ. 7.98 లక్షలకు దిగొచ్చింది. జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ ధర రూ. 80 వేలు తగ్గడంతో ఇప్పుడు రూ. 8.20 లక్షలకు చేరింది. జెడ్ఎక్స్ఐ సీఎన్జీ ధర రూ. 81 వేలు తగ్గింది. ఇక చివరగా జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎంటీ ధర రూ. 85 వేలు తగ్గి ఇప్పుడు ఎక్స్ షోరూం ధర రూ. 8.65 లక్షలకు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa