ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొరపాటు జరిగిదంటూ..,,తాలిబాన్ మంత్రి యూటర్న్.. మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం

national |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 08:36 PM

అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి మహిళ జర్నలిస్టులను అనుమతించలేదు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయ నాయకులతో పాటు మహిళ జర్నలిస్టులు దీన్ని తీవ్రంగా ఖండించారు. అఫ్గానిస్థాన్‌లో మహిళ హక్కులను కాలరాయడంతో పాటు.. భారత్‌లో కూడా మహిళలపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రియాంక గాంధీ, రాహల్ గాంధీతో పాటు పలువురు అగ్రనేతలు కూడా తీవ్రంగా విమర్శించారు. ఈ చర్య ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని.. మహిళలను కించపరిచినట్లేనని అన్నారు.


  దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాబిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ యూటర్న్ తీసుకున్నారు. తాము ఉద్దేశపూర్వకంగా మహిళ జర్నలిస్టులకు అనుమతి నిరాకరించలేదని చెప్పారు. ఎక్కడో జరిగిన పొరపాటు వల్ల అలా అయిందన్నారు. ఆదివారం నిర్వహించిన మరో సమావేశానికి మహిలా జర్నలిస్టులను ఆహ్వానించారు.


మహిళా జర్నలిస్టులకు అనుమతి నిరాకరణపై ఆఫ్గాన్ విదేశాంగ మంత్రి దీనిపై ఆదివారం స్పందించారు. ఇంతకుముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో మహిళా జర్నలిస్టులు లేకపోవడం టెక్నికల్ సమస్యగా అని చెప్పారు. దాన్ని చాలా తక్కువ సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. చాలా తక్కువ మందినే ప్రెస్‌మీట్‌కు పిలిచినట్లు తెలిపారు. అంతేగానీ ఇందులో ఇతర ఏ ఉద్దేశాలు లేవన్నారు. "ఆఫ్గానిస్థాన్ పాఠశాలలు, విద్యాసంస్థల్లో 10 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 2.8 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలు ఉన్నారు. మదర్సాల్లో.. గ్రాడ్యుయేషన్ వరకు విద్య బోధన జరుగుతుంది. కానీ మేము మహిళల విద్యను.. మతపరంగా 'హరామ్'గా ఎప్పుడూ ప్రకటించలేదు. అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వాటిని వాయిదా వేశాము" అని ముత్తాఖీ తెలిపారు.


ఏదీ నారీశక్తి..!


శుక్రవారం (అక్టోబర్ 10) దిల్లీలోని అఫ్గానిస్థాన్ దౌత్య కార్యాలయంలో ముత్తాఖీ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే అందులో ఒక్క మహిళ జర్నలిస్టు కూడా కనిపించలేదని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విదేశీ ప్రతినిధి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దేశంలోని మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకున్నారు. దీని ద్వారా వారికోసం ప్రభుత్వం నిలబడలేకపోయిందని స్పష్టమైందన్నారు. ఈ విషయంపై ప్రధాని మౌనం.. ఆయన చేసే నారీశక్తి నినాదంలో డొల్లతనాన్ని చూపిస్తోందని ఎద్దేవా చేశారు.


మరోవైపు, దేశంలోని ప్రతి మహిళకు సమాన భాగస్వామ్యం పొందే హక్కు ఉందని.. ప్రధాని మోదీ ఇలాంటి చర్యలను ఎలా అనుమతించారని ఎంపీ ప్రియాంక గాంధీ నిలదీశారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం రోజే ఇలా జరగడం.. మహిళలకు అవమానకరమని.. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa