ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్లలో అదే టార్గెట్.. ఉద్యోగులపై ఎస్బీఐ కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 09:00 PM

భారతదేశంలో ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఇది సేవలు అందిస్తోంది. ఎక్కువ మంది వినియోగించే బ్యాంకుల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇది ఒక ఫార్య్చూన్ 500 కంపెనీ. మల్టీనేషనల్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీగా ఉంది. బ్యాంక్ రికార్డుల ప్రకారం చూస్తే.. ఎస్బీఐ కస్టమర్ల సంఖ్య 50 కోట్లకుపైగానే ఉంది. మొత్తం 22,500 కుపైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. 63 వేలకుపైగా ఏటీఎంలను నిర్వహిస్తోంది. ఇంట్లో కచ్చితంగా ఒకరికి ఈ అకౌంట్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ అతిపెద్ద బ్యాంక్ ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేసింది.


>> ఉద్యోగుల లింగ వైవిధ్యాన్ని పెంచేందుకు.. ఒక వినూత్న వ్యూహాన్ని రూపొందించింది. ఇక్కడ మహిళా ఉద్యోగులకు సంబంధించి.. గొప్ప మనసు చాటుకుంది. తమ సిబ్బందిలో మహిళా ఉద్యోగుల్ని పెంచడమే లక్ష్యంగా.. 2030 నాటికి తమ ఉద్యోగుల్లో సుమారు 30 శాతం వరకు మహిళా సిబ్బంది ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఎస్బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య.. 2.40 లక్షలకుపైగానే ఉంది. ఇది దేశంలోని ఇతర ఏ బ్యాంకింగ్ సంస్థల్లోనైనా అత్యధికం కావడం విశేషం.


  దీనికి సంబంధించి.. ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ పోలుదాసు.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫ్రంట్‌లైన్ సిబ్బంది విషయానికి వస్తే మహిళలు 33 శాతం ఉన్నారు. కానీ మొత్తం ఉద్యోగుల్లో వారి శాతం 27 గానే ఉంది. దీనిని 30 శాతానికి చేర్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు.. బ్యాంక్ తదనుగుణంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు.


మహిళలు అన్ని స్థాయిల్లో అభివృద్ధి చెందేందుకు అనువైన కార్యాలయాన్ని సృష్టించేందుకు బ్యాంక్ కట్టుబడి ఉన్నట్లు కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఎంపవర్ హర్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది.


నాయకత్వ పాత్రల్లో.. మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఇనిషియేటివ్ ఇది. ఇక్కడ మహిళా ఉద్యోగుల్ని గుర్తించి.. వారికి నాయకత్వ శిక్షణ, కోచింగ్ సెషన్ల ద్వారా మార్గనిర్దేశం చేస్తారు.


పనిచేసే తల్లుల కోసం క్రెచ్ అలవెన్స్ అందిస్తుంది.


మెటర్నిటీ, ఇతర సెలవులు లేదా దీర్ఘకాలిక అనారోగ్యం తర్వాత తిరిగి విధుల్లో చేరే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది.


మహిళా ఉద్యోగుల అన్ని ఆరోగ్య అవసరాల్ని గుర్తించి.. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్స్, గర్భిణీ సిబ్బందికి పోషకాహార భత్యం, గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్స్‌ను కూడా బ్యాంక్ ప్రవేశపెట్టింది.


ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా.. దేశంలోని దాదాపు 340 కంటే ఎక్కువ శాఖల్ని.. పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడుపుతున్నట్లు.. త్వరలో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయనున్నట్లు డిప్యూటీ ఎండీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa