పిల్లలు విషయంలో ఏ తల్లి కూడా రిస్క్ తీసుకోకూడదు. వారికి ఎప్పుడు ఏం తినిపించాలి, ఎప్పుడు ఏం చేయాలనే విషయంపై ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆరాతీసి నిజాలు తెలుసుకుని అప్పుడే ఫాలో అవుతారు. ఇక పిల్లల ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయరు. చక్కగా వారి పాలు, ఘన ఆహారం ఇచ్చే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా వారికి పాలు మాత్రమే పడతారు. అయితే, కొన్ని నెలల తర్వాత ఉగ్గుపెడుతుంటారు. అయితే, ఉప్పు, పంచదారని పెట్టడానికి కూడా సరైన టైమ్ వయసు అంటూ ఉంటుంది. ఆ వయసు ప్రకారమే పిల్లలకి ఉప్పు, పంచదారని పెట్టాలని సూచిస్తున్నారు పిల్లల డాక్టర్ రవి మాలిక్.
తినిపించాల్సిన వయసు రాకముందే
డాక్టర్ రవి మాలిక్ ప్రకారం, పిల్లలకి ఏ వయసులో ఏం పెట్టాలో అవి మాత్రమే తినిపించాలని, అలా కాకుండా, ముందుగానే ఉప్పు, పంచదారలు పెడితే వారి లైఫ్లో ఎన్నో సమస్యలు వస్తాయని, ఇది వారి ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, సరైన టైమ్, పిల్లలకి ఉప్పు, పంచదారలు తినాల్సిన సరైన వయసు తెలిశాకే వారికి పెట్టాలి.
ఉప్పు ఎప్పుడు తినిపించాలి
డాక్టర్ మాలిక్ ప్రకారం, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంచనా ప్రకారం, సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఉప్పు ఇవ్వకూడదని సలహా ఇస్తున్నాయి. పుట్టిన పిల్లలకి మూత్రపిండాలు మెల్లిగా డెవలప్ చెందుతాయి. ఓ సంవత్సరం వయసు వచ్చే లోపు పర్తిగా పరిపక్వం చెందవు. కాబట్టి, అవి అదనపు సోడియంని ఫిల్టర్ చేయలేవు. కాబట్టి, అంతకు ముందే ఉప్పు తినిపిస్తే కిడ్నీలపై ఎఫెక్ట్ పెరిగి అది ఫ్యూచర్లో హైబీపి వంటి సమస్యలొస్తాయి.
చక్కెర ఎప్పుడు తినిపించాలి?
ఇక షుగర్ విషయానికొస్తే, రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకి స్వీట్స్ ఇవ్వడం మంచిది కాదని పిల్లల డాక్టర్ చెబుతున్నారు. చిన్న వయసుల్లోనే పిల్లలకి తీపిని తినిపిస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకి అవే క్రేవింగ్స్ ఉంటాయి. దీంతో బరువు పెరుగుతారు. షుగర్, దంతక్షయం వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, వారికి మొదటి రెండు సంవత్సరాలలోపు పంచదార ఇవ్వకపోవడమే మంచిది.
జ్యూస్లు
సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకి జ్యూస్లు ఇవ్వకూడదని డాక్టర్ చెబుతున్నారు. ఎందుకంటే, వాటిలో అధిక మొత్తంలో సహజ చక్కెర, లో ఫైబర్ ఉంటుంది. జ్యూస్ పిల్లల ఆకలిని కూడా తగ్గిస్తుంది. వారికి అవసరమైన పోషకాలు అందకుండా చేస్తుంది. అందువల్ల, తల్లిదండ్రులు పిల్లలకి విటమిన్స్, ఫైబర్ రెండూ అందేలా చూసుకోవడానికి ప్యూరీ చేసిన, గుజ్జులా చేసిన పండ్లని ఇవ్వడం మంచిది.
పిల్లల చేత ఉప్పు, పంచదార ఎప్పుడు తినిపించాలి.
అన్నీ తెలుసుకున్నాకే
పిల్లలకి అన్ని రుచులు పరిచయం చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ, వారికి సరైన వయసులోనే తినిపించాలి. అలా కాదని ముందుగానే వారికి తినిపిస్తే వారి ఆరోగ్యంపై నెగెటీవ్ ఎఫెక్ట్ పడడమే కాకుండా, ఫ్యూచర్లో పిల్లలు ఆ రుచుల్నే కోరుకుంటారు. అందుకే, ముందునుంచే పిల్లలకి సరైన ఆహారం, పోషకాహారం ఇవ్వడం మంచిది. షుగర్, ఉప్పు, జంక్ ఫుడ్ వంటివాటికి దూరంగా ఉంచుతూ మంచి ఆహారం ఇస్తూ వారి ఆరోగ్యానికి భరోసానివ్వండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa