ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:47 PM

AP: సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు శోభా గ్రూప్ చైర్మన్ మీనన్ రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. లైబ్రరీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆ సంస్థను కోరారు. అంతేకాక, రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చలు జరిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa