మహారాష్ట్రలో చిరుత ప్రజలను భయపెడుతూ ఉంది. పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్లోని గ్రామస్తులపై నెల రోజులుగా దాడులకు కారణమైన చిరుతపులిని షార్ప్షూటర్లు చంపినట్లు అటవీ అధికారులు తెలిపారు.పింపార్ఖేడ్ గ్రామం సమీపంలోని కాలిగుర్తుల ద్వారా ఆ చిరుతను గుర్తించారు. మొదట ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ, పరిస్థితులు ఊహించని విధంగా మారడంతో చిరుతను చంపాల్సి వచ్చింది అని అధికారులు పేర్కొన్నారు.గత నెలలో శిరూర్ తహసీల్లోని మౌజే పింపార్ఖేడ్ ప్రాంతంలో చిరుతపులి దాడుల్లో ఇద్దరు మైనర్లు, ఒక వృద్ధుడు మరణించారు. ఈ ఘటనలపై జున్నార్, శిరూర్, అంబేగావ్, ఖేడ్ తాలూకాల్లో నిరసనలు కొనసాగాయి. ఆదివారం, పింపార్ఖేడ్ గ్రామం సమీపంలో 13 ఏళ్ల బాలుడు చిరుత దాడిలో మరణించిన తర్వాత, స్థానికులు ఆగ్రహంతో అటవీ శాఖ వాహనాన్ని ధ్వంసం చేశారు. స్థానికులు ఆ చిరుతను పట్టుకోవాలని లేదా చంపేయాలని డిమాండ్ చేశారు.అటవీ అధికారులు, మృతదేహాన్ని గ్రామస్తులకు చూపించిన తర్వాత, పోస్టుమార్టం కోసం మానిక్డో రీస్క్యూ సెంటర్కు తరలించారు. మంగళవారం మరియు బుధవారం నాడు, పింపార్ఖేడ్, జాంబుట్ గ్రామాల సమీపంలో దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలో రెండు చిరుతపులులను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో జాంబుట్లో చిరుతపులి దాడిలో ఒక వ్యక్తి మరణించినట్లు తెలిపారు.వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం, పూణే జిల్లాలోని జున్నార్ అటవీ విభాగంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు సుమారు 6–7 చిరుతపులులు ఉన్నాయని నివేదన ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa