రామచంద్రపురం నియోజకవర్గాన్ని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తొలగించి, కాకినాడ జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఇవాళ రామచంద్రపురం బంద్కు పిలుపునిచ్చింది. ఈ డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.తమ నియోజకవర్గానికి పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కాకినాడ జిల్లానే అనుకూలంగా ఉంటుందని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం తమకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, అదే కాకినాడ అయితే కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉందని వారు గుర్తుచేస్తున్నారు. భౌగోళికంగా, వాణిజ్యపరంగా కూడా తమకు కాకినాడతోనే ఎక్కువ సంబంధాలున్నాయని ప్రజలు చెబుతున్నారు.కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మద్దతివ్వని వారిపై కొందరు నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా వారు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa