ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ ప్రాంత పరిస్థితులపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 05:14 PM

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. శనివారం నాడు తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. దారి పొడవునా ప్రతి చెట్టును, మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆరా తీశారు.అనంతరం నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్‌ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పర్యటనలో భాగంగా గుంటి మడుగు వాగు వద్ద కాసేపు కూర్చుని, అక్కడి ప్రశాంత వాతావరణాన్ని, పరిసరాలను తిలకించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa