ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:25 PM

 తిరుపతి, మంగళంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారంలోకి రాగానే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. గత ఐదేళ్లలో లక్షా 30 వేల చెట్లను నరికేశారని, విపరీతంగా స్మగ్లింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. నేపాల్‌లో కూడా మన ఎర్రచందనం పట్టుబడిన నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నామని పవన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa