ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో నమాజ్ చేయడంపై బీజేపీ అభ్యంతరం

national |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 04:11 PM

కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కొందరు నమాజ్ చేయడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్‌లో ఇలాంటి వాటికి ఎలా అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది.ఈ ఘటన కెంపెగౌడ విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో జరిగినట్లు బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోను ఆదివారం రాత్రి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "హై సెక్యూరిటీ జోన్‌లో నమాజ్ చేయడానికి వీరు ముందస్తు అనుమతి పొందారా? ఇది అత్యంత సున్నితమైన ప్రాంతంలో తీవ్రమైన భద్రతా సమస్య కాదా?" అని ఆయన ప్రశ్నించారు. "ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని పథ సంచలన్ నిర్వహిస్తే అభ్యంతరం చెప్పే ప్రభుత్వం, ఇలాంటి కార్యకలాపాలను ఎందుకు చూసీచూడనట్లు వదిలేస్తోంది?" అని ఆయన విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa