తిరుమల లడ్డూ పై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ, లేని కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేవలం వైయస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాల కోసం చివరకు దేవుడినీ రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నెయ్యి నాణ్యతపై ఈవో, చంద్రబాబు, లోకేష్ లు తలో మాట మాట్లాడుతూ... కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు. లడ్డూ ప్రసాదంపై ఆధారాలుంటే నేరుగా సిట్ అధికారులే ఆ వివరాలను ఎందుకు భయటపెట్టడం లేదని సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఆలయాల్లో భక్తుల రక్షణలో విఫలమైన కూటమి ప్రభుత్వం... కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఆరోపణలు చేస్తోందని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa