ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వెంకటేశ్ ప్రసాద్

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 07:17 PM

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్  అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. అతడికి టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ తమ పూర్తి మద్దతును తెలిపారు. కర్ణాటక క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నామని, తెర వెనుక నుంచి నడిపించే పెత్తనానికి చరమగీతం పాడతామని స్పష్టం చేశారు.ఈ నెల 30న కేఎస్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెంకటేశ్ ప్రసాద్తన ప్యానెల్ వివరాలను వెల్లడించాడు. చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్‌కు మళ్లీ మంచి రోజులు తీసుకురావాలి. దీనికి తెర వెనుక నుంచి ఎవరూ నియంత్రించలేని స్వతంత్ర పరిపాలన అవసరం. అధికారం కోసమో, పదవుల కోసమో మేము పోటీ చేయడం లేదు. కర్ణాటక క్రికెట్ ప్రయోజనాలే మాకు ముఖ్యం అని అన్నాడు.2010-13 మధ్య కాలంలో కుంబ్లే అధ్యక్షుడిగా, శ్రీనాథ్ కార్యదర్శిగా, తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసోసియేషన్‌ను విజయవంతంగా నడిపించామని ప్రసాద్ గుర్తుచేశాడు. ఆ సమయంలో క్రికెట్, మౌలిక సదుపాయాలు రెండూ అభివృద్ధి చెందాయని, ప్రస్తుత పరిస్థితి మాత్రం విచారకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే విజయవంతమైన కాలాన్ని పునరావృతం చేసేందుకు తమ ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa