భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్ట్ డైరెక్టర్, పద్మశ్రీ తోట తరణి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం 'చెవాలియర్' అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. నవంబర్ 13న చెన్నైలోని అలయన్స్ ఫ్రాంకైస్లో జరిగే కార్యక్రమంలో ఫ్రెంచ్ రాయబారి చేతుల మీదుగా తోట తరణి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ అరుదైన గౌరవం పొందిన ఆరో భారతీయుడిగా తోట తరణి నిలవనున్నారు. గతంలో దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే, నటులు శివాజీ గణేశన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రెండు జాతీయ అవార్డులు, మూడు నంది అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర అవార్డులతో పాటు 2001లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.1978లో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తెలుగు చిత్రం 'సొమ్మొకడిది సోకొకడిది'తో తోట తరణి తన కెరీర్ను ప్రారంభించారు. మణిరత్నం, శంకర్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన 'నాయకుడు', 'సాగర సంగమం', 'గీతాంజలి', 'దళపతి', 'శివాజీ', 'దశావతారం', 'పొన్నియిన్ సెల్వన్' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసి భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేశారు. 'చెవాలియర్' అవార్డు విషయాన్ని ప్రకటించగానే తోట తరణిపై అభినందనలు వెల్లువెత్తాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా బుధవారం సోషల్ మీడియా వేదికగా తోట తరణిని ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa