ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ లో ఎన్డీయే కూటమి ప్రభంజనం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 03:44 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా, కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీయే అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122ను సునాయాసంగా దాటి, దాదాపు 200కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఎన్డీయే విజయం ఖాయమవడంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫలితాలపై బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఇది ప్రజలు ఇచ్చిన సానుకూల తీర్పు అని, డబుల్ ఇంజన్ సర్కార్ సమర్థవంతమైన పాలనకు లభించిన మద్దతు అని ఆయన పేర్కొన్నారు. బీహార్ ప్రజలు కుల సమీకరణాలను పక్కనపెట్టి అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రచారం, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని జీవీఎల్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. "పురుషుల్లో ఉండే కులభావనలు మహిళల్లో ఉండవు. వారు అభివృద్ధి, సుపరిపాలనకే ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేశారు" అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa