ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారందరికీ,,,మూడు నెలల్లో కొత్తగా పింఛన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 07:18 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. కేటగిరీల వారీగా ఈ పింఛన్లు నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉన్నాయి. అయితే ఏపీలో పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాలతో పాటుగా, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు, టీడీపీ అనుబంధ విభాగాలకు ఇటీవల నియామకాలు చేపట్టారు.


కొత్తగా నియమితులైన వారితో శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ ఆంజనేయులు.. గత వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తల పింఛన్లు తొలగించారని ఆరోపించారు. అర్హులైన 3 లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లను తొలగించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వచ్చే మూడు నెలల్లో అలాం పింఛన్లు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలు అందరికీ కచ్చితంగా పింఛన్లు ఇప్పిస్తానని జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు.


మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీలో వివిధ వర్గాలకు ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు రూ.6000 చొప్పున ప్రతి నెలా పింఛన్ అందిస్తున్నారు. పూర్తి వైకల్యంతో బాధపడేవారికి రూ.15000 చొప్పున పింఛన్ అందిస్తున్నారు.


ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ట్రాన్స్ జెండర్లు ఇలా వివిధ వర్గాలకు ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉండి.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి.. అన్ని అర్హతలు కలిగిన వారికి పింఛన్లు అందిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తం పెంచిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa