ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల అప్పుడే.!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:26 PM

ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజన తో కలిసి ఏపీ ప్రభుత్వం అమలుచేస్తోంది. అందులో భాగంగా 2025 ఆగస్ట్ నెల ప్రారంభంలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7000 జమ చేశారు. పీఎం కిసాన్ యోజన 20వ విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5000 కలిపి.. రూ.7000 జమ చేశారు. 47 లక్షల మందికి పైగా రైతుల బ్యా్ంక్ ఖాతాలలో ఈ సొమ్ములు జమ చేశారు.


మరోవైపు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 19వ తేదీన పీఎం కిసాన్ యోజన 21వ విడత డబ్బులు విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19వ తేదీన పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు. పీఎం కిసాన్ యోజన కింద దేశంలోని 11 కోట్లకు పైగా రైతులకు రూ.2000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా నవంబర్ 19న రైతుల అకౌంట్లలో జమ చేసే అవకాశాలు ఉన్నాయి.


అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాల్లోకి వస్తే.. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరు మీద ఈ తరహా పథకాన్ని అమలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.13500 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయగా.. తాము అధికారంలోకి వస్తే రూ.20 వేలు అందిస్తామని 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమిహామీ ఇచ్చింది.


ఇక ఇచ్చిన హామీ ప్రకారం 2025 ఆగస్ట్ నెలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు. అలాగే ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు.. ఆ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే డబ్బులు అకౌంట్లలో జమచేశారు. ఇప్పుడు రెండో విడత నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa