ఐపీఎల్ రిటెన్షన్ డెడ్లైన్కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. నవంబర్ 15న అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ను ప్రకటించనన్నాయి! ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండింగ్లోకి వచ్చింది. ఏ ఫ్రాంఛైజీ ఎవరిని రిలీజ్ చేస్తుంది? ఎవరిని రిటైన్ చేసుకుంటుంది? అనే చర్చ మొదలైంది. అయితే ఫ్రాంఛైజీలు ఎవరెవరిని రిలీజ్ చేసే అవకాశం ఉందో ఇప్పుడో లుక్కేద్దాం..
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. నలుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇందులో లియామ్ లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్, బ్లెస్సింగ్ ముజర్బానీ, రసిక్ సలామ్ దార్ ఉన్నట్లు తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్..
గతేడాది పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో భారీ ప్రక్షాళన చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, జెమీ ఓవర్టన్ను వదిలేయనున్నట్లు తెలుస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో రవి బిష్ణోయ్ను రిటైన్ చేసుకుంది. కానీ తాజాగా అతడిని విడుదల చేయాలని భావిస్తోందట. అతడితో పాటు డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమర్ జోసెఫ్ను సైతం ఆ ఫ్రాంఛైజీ వదిలేస్తుందని ప్రచారం జరుగుతోంది.
కోల్కతా నైట్ రైడర్స్..
2024లో ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్.. గతేడాది గాడి తప్పింది. దీంతో ఈసారి పటిష్ట జట్టును నిర్మించుకోవాలని భావిస్తోంది. రూ.20 కోట్లకు పైగా ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ను ఆ జట్టు విడుదల చేయనుంది. అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్ను కూడా కేకేఆర్.. రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్ను ట్రేడ్ చేస్తుందని సమాచారం. అతడు కాకుండా మహీశ్ తీక్షణ, ఫజల్హక్ ఫరూఖీ, క్వెనా మఫాక, లువాన్ డ్రీ ప్రిటోరియస్ను ఆ జట్టు విడుదల చేసే అవకాశం ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్.. హెన్రిచ్ క్లాసెన్ను విడుదల చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa