చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఇది ఒక ఆనంద వార్తలా మారింది. కేరళ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం CSK జట్టులో చేరడంతో యెల్లో ఆర్మీ సోషల్ మీడియా సంబరాలతో నిండిపోయింది. గత కొన్నేళ్లుగా ధోనీ తర్వాత ఎవరు అనే ప్రశ్న జట్టును తొలికించింది. ఇప్పుడు సంజూతో ఆ శూన్యత నిండినట్టు కనిపిస్తోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
గతంలో రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా, మళ్లీ ధోనీనే జట్టును నడిపించారు. అయితే రుతురాజ్ పై నమ్మకం పూర్తిగా కుదరలేదని, లీడర్షిప్లో ఇంకా పరిణతి అవసరమని అంచనాలు వచ్చాయి. ఇక ధోనీ వయసు మీద పడుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక నాయకత్వం కోసం ఒక దీర్ఘకాలిక ప్లాన్ అవసరమని CSK మేనేజ్మెంట్ భావించినట్టు కనిపిస్తోంది. అందుకే సంజూ శాంసన్ను భారీ మొత్తంలో కొనుగోలు చేశారు.
విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే సంజూ శాంసన్కు ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్లో కెప్టెన్సీ అనుభవం ఉంది. టీమ్ ఇండియాలోనూ వికెట్ కీపర్గా స్థిరత్వం చూపించాడు. అతని దూకుడైన బ్యాటింగ్, ఆట గురించి అవగాహన, యంగ్ ప్లేయర్స్ను ప్రోత్సహించే స్వభావం CSKకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని నిపుణుల అభిప్రాయం. అందుకే సంజూనే ధోనీ తర్వాత శాశ్వత కెప్టెన్ అని చాలా మంది భావిస్తున్నారు.
ఇదే సమయంలో జట్టు భవిష్యత్తు కోసం రవీంద్ర జడేజాను కూడా వదులుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జడ్డూ లాంటి ఆల్రౌండర్ను రిటైన్ చేయకపోవడం వెనుక బడ్జెట్ ప్లానింగ్, యంగ్ టాలెంట్కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉండి ఉండవచ్చు. మొత్తంమీద CSK ఈ మెగా ఆక్షన్లో ధోనీ యుగం తర్వాత కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa