ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెస్టు ఓటమిపై సౌరవ్ గంగూలీ అసంతృప్తి

sports |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 04:33 PM

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత జట్టు అనుసరించిన వ్యూహంపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్‌లను మూడు రోజుల్లో ముగించడం కాకుండా, ఐదు రోజుల పాటు ఆడి గెలవడంపై దృష్టి పెట్టాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఆయన  సూచించాడు.కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. బౌలర్లకు విపరీతంగా అనుకూలించిన ఈ పిచ్‌పై 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం పిచ్‌ను తమ జట్టు సూచనల మేరకే క్యూరేటర్ సిద్ధం చేశారని గంభీర్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించారు. గంగూలీ మాట్లాడుతూ.. "అది టెస్టు క్రికెట్‌కు అంత మంచి వికెట్ కాదు. అయినా భారత్ 120 పరుగులు చేసి ఉండాల్సింది. తమకు అలాంటి పిచ్ కావాలని గంభీరే క్యూరేటర్‌కు చెప్పాడని తెలిసింది. దీనిపై వివాదం ఏమీ లేదు, కానీ మనం మంచి పిచ్‌లపై ఆడాలి" అని స్పష్టం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa