అమరావతి ప్రాంత రైతులు CRDA అసిస్టెంట్ కమిషనర్తో రాజధాని ప్రాంతంలోని CRDA ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించి, తమ సమస్యలు, సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, CRDA కార్యాలయం అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉందని, తమ అనుమానాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నామని తెలిపారు. తాము కోరిన అమరావతి డీ-నోటిఫికేషన్ను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చేస్తామని, అలాగే R5 జోన్లో కేటాయించిన వారికి స్థానికంగా ఉండే దగ్గర ప్రాంతంలో ఇచ్చి త్వరలో సెటిల్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని రైతులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న మూడు రాజధానుల కేసు విషయం గురించి త్వరలో మాట్లాడి పరిష్కరిస్తామని అధికారులు చెప్పారని వెల్లడించారు. దీనితో పాటు, కరకట్ట బలోపేతం, గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యల పరిష్కారం గురించి కోరామన్నారు. అయితే, "CRDA అధికారులు తమను హేళనగా చూస్తున్నారు" అంటూ రైతులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్లో సమస్యలు పరిష్కారం కాకుండానే 'అయినట్లుగా' మెసేజ్ లు వస్తున్నాయని, గ్రీవెన్స్ డిప్యూటీ కలెక్టర్ జయ శ్రీ పై కూడా ఫిర్యాదు చేశామని, ఇప్పటివరకు ఇచ్చిన గ్రీవెన్స్ ఫిర్యాదులు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన 14 అంశాల వినతి పత్రం గురించి ప్రశ్నించగా, రోడ్డు పోట్లు, గ్రామ కంఠాలు, జరీబు నాన్ జరీబు వంటి కొన్ని అంశాలు క్లిష్టతరమని కమిషనర్ చెప్పారని, వాటన్నిటికీ గతంలో పని చేసిన ల్యాండ్స్ డైరెక్టర్ కారణమని కమిషనర్ దృష్టికి గట్టిగా తీసుకెళ్ళామని రైతులు చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa