ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిల్‌ ప్లేసులో రుతురాజ్‌ నే జట్టులోకి తీసుకోవాలి: ఆకాశ్ చోప్రా

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 10:02 PM

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నవంబర్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. గువహటి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోయిన భారత్.. సిరీస్‌లో 0-1తో వెనకబడి పోయింది. దీనికి తోడు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటం జట్టుకు ఇబ్బంది కరంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అతడు రెండో టెస్టుకు దూరమైతే.. జట్టులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేవ్‌దత్‌ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్‌లలో ఒకరికి చోటు దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.


“కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ ఆడతాడా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ అతడు దూరమైతే.. అతడి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. అయితే ఇప్పటికే జట్టును ప్రకటించారు. అతన్ని ఎలా తీసుకుంటారనే ప్రశ్న వస్తుంది. సాయి సుదర్శన్, దేవ్‌దత్‌ పడిక్కల్‌ రిజర్వ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్ట్‌ హ్యాండర్లు ఉన్నారు. పడిక్కల్, సుదర్శన్‌లలో ఎవరిని తీసుకున్నా.. తుది జట్టులో ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లవుతారు. ఇది అస్సలు కరెక్టు కాదు” అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.


కాగా కొన్ని రోజులుగా భారత జట్టుకు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ .. ఇటీవల రంజీ, దులీప్‌ ట్రోఫీల్లో చక్కగా రాణించాడు. అతడు చివరిసారిగా 2024 జులైలో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు టెస్ట్ డెబ్యూ చేయలేదు. కానీ దేశవాళీల్లో మాత్రం సత్తాచాటుతున్నాడు. దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌లో వెస్ట్‌ జోన్‌ తరఫున ఆడిన రుతురాజ్‌ 184 రన్స్ చేశాడు. నవంబర్‌ 13న దక్షిణాఫ్రికా ఏ, ఇండియా ఏ మధ్య జరిగిన అనధికారిక వన్డే మ్యాచ్‌లో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa