ఈ ఏడాది ఆదాయపు పన్ను (ITR 2025) రిఫండ్లు ఆలస్యమవుతున్న కారణాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ వివరించారు.అధిక మొత్తాల్లో రిఫండ్లకు పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడం వల్ల కొన్ని రిఫండ్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఆయన తెలిపారు. సిస్టమ్లో “రెడ్ ఫ్లాగ్” అయ్యిన ఫైలింగ్స్ను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని కూడా చెప్పారు.చిన్న మొత్తాల రిఫండ్లు సాధారణంగా సమయానికి జరుగుతున్నాయి. అయితే, పెద్ద మొత్తాల్లో రిఫండ్ల విషయంలో ఇంకా పూర్తి నిర్ధారణ అవసరం ఉందని ఆయన సూచించారు. కొన్నింటిలో తప్పుడు మినహాయింపులు లేదా అసామాన్యంగా అధిక మొత్తాలు క్లెయిం చేయబడినట్లు గుర్తించామని, వాటిని సరిచూడటం జరుగుతున్నట్లు చెప్పారు. సరైన క్లెయింలను ఈ నెలాఖరు లేదా డిసెంబర్లో పరిష్కరిస్తామని రవి అగర్వాల్ పేర్కొన్నారు.కొందరు పన్ను చెల్లింపుదారులు అసంపూర్ణంగా లేదా తప్పుగా రిటర్న్లు దాఖలు చేసినట్లు గమనించామని ఆయన చెప్పారు. వారిని రిటర్న్లను సరిచేసి మళ్లీ ఫైల్ చేసుకోవడానికి సూచించినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు ఆదాయపు పన్ను రిఫండ్లు గత సంవత్సరం కంటే సుమారు 18% తగ్గి, ₹2.42 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆయన వివరించారు. రిఫండ్ కోసం క్లెయిమ్ చేసిన వారి సంఖ్యలో తగ్గుదల, అలాగే పన్ను శ్రేణులలో మార్పులు ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని అగర్వాల్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa