ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇప్పటికే పాడేరు కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 05:22 PM

ప్రభుత్వ మెడికల్ కాలేజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. వైయస్.జగన్ హాయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పాడేరు కాలేజీ గతేడాదే 50 సీట్లతో ప్రారంభం కాగా, ఎన్ ఎమ్ సీ అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఏడాది మంజూరైన 50 సీట్లు రద్దవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. పేద విద్యార్ధులకు వైద్య విద్యను, ప్రజలకు వైద్యాన్ని అందకుండా చేసిన చేతకాని ఆరోగ్యశాఖ మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa