ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న కాప్30 వాతావరణ సదస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న ఈ సదస్సు వేదికపై కీలకమైన ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి వేలాది మంది ప్రతినిధులను సురక్షితంగా బయటకు తరలించారు.సదస్సు ముగింపునకు 24 గంటల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ పెవిలియన్లో మంటలు చెలరేగినట్లు భద్రతా ఫుటేజీలో నమోదైంది. విద్యుత్ పరికరాల షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని, ఆరు నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో 13 మంది పొగ పీల్చడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని నిర్వాహకులు వెల్లడించారు.ఈ ప్రమాదం కారణంగా అత్యంత కీలకమైన చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు ఉదయం వరకు చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం, వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై దాదాపు 200 దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa