భారత టెస్టు జట్టుకు మరో బిగ్ షాక్! దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి గువాహటిలో ప్రారంభం కానుంది. కానీ ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదని BCCI అధికారికంగా ప్రకటించింది. మెడ గాయం కారణంగా గిల్ ఈ సిరీస్లో ఇప్పటివరకూ ఒక్క బంతి కూడా ఆడలేకపోయాడు.
తొలి టెస్టులో బ్యాటింగ్కే దూరమైన గిల్, చికిత్స అనంతరం గువాహటి వచ్చినప్పటికీ ఫుల్ ఫిట్నెస్ సాధించలేకపోయాడు. BCCI మెడికల్ టీమ్ అంచనా ప్రకారం ఇప్పుడు క్రికెట్ ఆడే స్థితిలో లేడని తేలింది. దీంతో రెండో టెస్టుకు గిల్ పూర్తిగా తప్పాడు. మరింత చికిత్స, రికవరీ కోసం అతను ముంబైకి తరలివెళ్తున్నట్లు సమాచారం.
గిల్ లేకపోవడంతో భారత్ నాయకత్వ బాధ్యతలు వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ చేపట్టనున్నాడు. గాయం నుంచి మెరుగ్గా కోలుకుని జోరుగా ఫామ్లో ఉన్న పంత్కు ఇది టెస్టు కెప్టెన్సీలో మరో అవకాశం. ఇంతక ముందు కూడా అత్యవసర పరిస్థితుల్లో జట్టును నడిపిన అనుభవం పంత్కు ఉంది.
ఈ మ్యాచ్తో రిషబ్ పంత్ భారత టెస్టు చరిత్రలో అతి పిన్న వయసులో కెప్టెన్ అయిన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉంది. గువాహటి పిచ్ స్పిన్కు ఎక్కువగా దన్నుగా నిలుస్తుందని అంచనాల నడుమ, పంత్ నాయకత్వంలో భారత్ ఎలాంటి ప్లాన్ అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa