కర్ణాటకలో అధికార మార్పిడిపై జరుగుతోన్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. సిద్దరామయ్యే ముఖ్యమంత్రిగా ఐదేళ్లూ కొనసాగుతారని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఆయనకు తామంతా సహకరిస్తామని ఆయన వెల్లడించారు. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మావాళ్లేనని, గ్రూప్లంటూ లేవని ఆయన తేల్చిచెప్పారు. అధిష్ఠానం ఆదేశాలకు మేము కట్టుబడి ఉంటామని, క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఏఎన్ఐతో డీకే చెప్పారు. ఆయన మాట్లాడిన ఈ వీడియోను ఏఎన్ఐ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
‘‘గ్రూప్లు కట్టడం నా రక్తంలోనే లేదు.. మొత్తం 140 మంది నా ఎమ్మెల్యేలే.. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం నిర్ణయించారు.. మంత్రి పదవి కోసం ప్రతిఒక్కరూ ఆశపడతారు.. ఈ క్రమంలోనే ఢిల్లీలో అధిష్ఠానాన్ని ఆశావాహులు కలవడం సర్వసాధారణమే. కొందరు ఖర్గే జీని కలిశారు.. అలాగే సీఎంను కూడా కలుసుకున్నాు.. అది వారి హక్కు కూడా..! వాళ్లు బాధ్యతలను కోరుకుంటున్నారు.. హైకమాండ్ వద్దకు వెళ్లొద్దని మేం వారికి చెప్పి ఆపలేం కదా..! పూర్తికాలం తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పారు. ఆయనకు మేమంతా అభినందనలు తెలియజేస్తు్న్నాం. ఆయనతో కలిసి పనిచేస్తాం. సీఎం అయినా.. నేనైనా పదే పదే చెప్పేది ఒక్కటే.. హైకమాండ్ ఆదేశాలకు మేం కట్టుబడి ఉంటాం’’ అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన పోస్టులో రాసుకొచ్చారు.
మరోవైపు, సీఎం సిద్దరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ హైకమాండ్ ప్రత్యేక హక్కు అని నొక్కి చెప్పారు. ‘క్యాబినెట్ విస్తరణ అంతా హైకమాండ్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది.. ఆయన (డీకే), నేను, అందరూ అందరూ హైకమాండ్ చెప్పేది వినాలి... తదుపరి బడ్జెట్ను నేనే ప్రవేశపెడతాను.. రేపు మల్లికార్జున్ ఖర్గేను కలుస్తాను.’ అని వ్యాఖ్యానించారు.
2023లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకుంది. చివరకు అధిష్ఠానం సూచనలతో డీకే వెనక్కి తగ్గారు. కానీ, చెరో రెండున్నరేళ్లు అధికార పంపిణీ ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. నవంబరు 20 గురువారంతో సిద్ధూ రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నారు. దీంతో కర్ణాటకలో అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం సాగుతోంది. సిద్ధూ, డీకే మద్దతుదారులు వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలో డీకే మద్దతుదారులు అధిష్ఠానం నుంచి హామీ లభించినట్టు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్య కొనసాగుతారని చెప్పడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa