మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా పెద్ద హడావిడి సృష్టించడం సాధారణం అయిపోయింది. జగన్ ఎక్కడికి వస్తున్నాడో ఆ ప్రాంత పోలీసులకు పెద్ద టెన్షన్ గా మారిపోతుంది.ఆయన హడావిడి వల్ల ఎవరి మీద కారు ఎక్కుతుందో, ఎవరు దాడికి గురి అవుతారో, ఎవరు ప్రమాదంలో పడతారో అనే భయం పోలీసులు కలిగారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా ఈ తరహా అవినీతులు, హంగామాలు జరుగుతుంటాయనే పరిస్థితి ప్రజలకు కూడా తెలిసిందే.ఇక నిన్న తెలంగాణలో సీబీఐ కోర్టు ముందు విచారణకు వచ్చినప్పుడు జగన్ ఏ స్థాయి గందరగోళం సృష్టించారో చూశాం. తన బిల్డప్ కోసం ఏకంగా ఏపీ నుండి తన వైసిపి కార్యకర్తలను రప్పించుకున్నారు. వైసిపి కార్యకర్తల రప్ప రప్ప నినాదాలు, పోస్టర్లు వలన అక్కడ భయానక వాతావరణం ఏర్పడ్డది, ఇది హైదరాబాద్ ప్రజలలో కొంత ఆందోళనను కలిగించింది.ప్రజలు, జగన్ బ్యాచ్ ఎక్కడ దాడి చేస్తుందో, ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారో అని భయపడుతున్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లినా, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనగా కూడా ఇలాంటి “రప్ప రప్ప” నినాదాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోర్టులో కూడా అదే స్థాయి నినాదాలు, హంగామాలు జరిగాయన్న వార్త వినిపిస్తోంది.నేటిజన్లు ఈ రకమైన స్థితిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వైసిపి కార్యకర్తల ఈ విధమైన అరాచకాలు అధికారం పొందిన కొత్త కాలంలోనే కనిపించడం ప్రజలకు భయానకంగా అనిపిస్తోంది. ఇలాంటి నినాదాలు జగన్ కి ప్రతికూల ప్రభావం చూపుతాయని, భవిష్యత్తులో ఏపీ ప్రజలు వైసిపి కి మరోసారి మద్దతు ఇవ్వరు అనే సూచన ఇస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa