మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భారత్ జట్టు టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. శుక్రవారం బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో టీమిండియా సూపర్ ఓవర్లో ఓడిపోయింది.మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 194 పరుగులు చేసింది. గెలుపు కోసం బరిలోకి దిగిన టీమిండియా కూడా 20 ఓవర్లలో అదే స్కోరు సాధించింది. కాబట్టి మ్యాచ్ టై అయ్యింది. అయితే సూపర్ ఓవర్లో భారత్ ఒక్క పరుగు కూడా సాధించలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టు ఫస్ట్ బౌలర్ వైడ్ ద్వారా ఒక్క పరుగు సాధించి ఫైనల్కు చేరింది.దోహా వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హబీబుర్ రెహమాన్ 46 బంతుల్లో 65 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. జీషాన్ ఆలం 14 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుకు మద్దతు అందించాడు. 16.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ స్కోరు 130 వరకు మాత్రమే చేరింది. ఆ తర్వాత ఎస్.ఎం. మెహ్రోబ్ హసన్ 18 బంతుల్లో 48 పరుగులు చేసి స్కోరు 194కి పెంచాడు. టీమిండియా తరఫున గుర్జపానీత్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు, స్పిన్నర్ సుయాష్ శర్మ ఒక వికెట్ తీశాడు.భారత జట్టు వైభవ్ సూర్యవంశీ, ప్రియాంష్ ఆర్యలు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వైభవ్ మొదటి ఓవర్లో 19 పరుగులు చేసి జట్టుకు బలమైన ప్రారంభం ఇచ్చాడు. ప్రియాంష్ 44 పరుగులు చేసి జట్టును 98 పరుగులకు చేరవేసాడు. కెప్టెన్ జితేష్ శర్మ, నెహాల్ వధేరా జంటగా స్కోరు 150కి పెంచారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 16 పరుగులు కావాల్సి వచ్చింది. అశుతోష్ శర్మ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి జట్టుకు 4 పరుగులు చేర్చాడు, కానీ తర్వాత బౌల్డ్ అయ్యాడు.మ్యాచ్ చివరి బంతికి భారత్ జట్టు రెండు పరుగులు కావాల్సి ఉంది. హర్ష్ దుబే ఫీల్డర్ వైపు షాట్ ఆడినా రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. రనౌట్ ప్రయత్నం తప్పిపోయింది, భారత్ మూడో పరుగు పూర్తి చేసి మ్యాచ్ను టై చేయించింది.తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. జితేష్ శర్మ మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు, అశుతోష్ రెండో బంతికే క్యాచ్ ఇచ్చాడు. భారత్ ఒక్క పరుగు కూడా సాధించలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టు ఒకే ఒక్క పరుగు అవసరమని, అది ఫస్ట్ బౌల్ వైడ్ ద్వారా సాధించి ఫైనల్లోకి చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa