ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్ఫ్‌లో చరిత్ర సృష్టించిన ప్రణవి ఉర్స్

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 06:39 AM

భారత గోల్ఫ్ చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. యువ క్రీడాకారిణి ప్రణవి ఉర్స్ సంచలన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషులతో కలిసి పోటీపడి, వారిని ఓడించి ఓ ప్రొఫెషనల్ టోర్నమెంట్‌లో టైటిల్ గెలుచుకున్న తొలి భారత మహిళా గోల్ఫర్‌గా ఆమె రికార్డులకెక్కింది. ముంబైలోని బాంబే ప్రెసిడెంట్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్  ఇన్విటేషనల్ టోర్నీలో ఆమె ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.ఫైనల్ రౌండ్ ఆరంభానికి ముందు, ప్రణవి తన బాయ్‌ఫ్రెండ్, లీడర్‌గా ఉన్న కరణ్‌దీప్ కొచ్చర్ కంటే రెండు షాట్లు వెనుకబడి ఉంది. అయితే చివరి రోజు అద్భుతంగా పుంజుకున్న ఆమె, ఎక్కడా పొరపాటు చేయకుండా 8-అండర్ స్కోరుతో అసాధారణ ప్రదర్శన కనబరిచింది. చివరికి రెండు షాట్ల ఆధిక్యంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన ప్రణవికి రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ లభించగా, రెండో స్థానంలో నిలిచిన కరణ్‌దీప్ కొచ్చర్ రూ. 15 లక్షలు అందుకున్నాడుఈ విజయంపై ఐజీపీఎల్ సీఈఓ ఉత్తమ్ సింగ్ ముండీ స్పందిస్తూ ఇది ఒక సంచలన విజయం. పురుషులను ఓడించి ఓ మహిళ టైటిల్ గెలవడం మా లీగ్‌కు గర్వకారణం అని అన్నారు. ప్రణవి ఆటతీరు అద్భుతమని, ఈ రోజు ఆమెను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని కరణ్‌దీప్ కొచ్చర్ ప్రశంసించాడు.భారత గోల్ఫ్ దిగ్గజం ఎస్‌ఎస్‌పీ చౌరాసియా, ఒలింపియన్ ఉదయన్ మానే వంటి ప్రముఖులు సైతం ప్రణవి ఆటను కొనియాడారు. భారత మహిళా గోల్ఫ్ సంఘం సెక్రటరీ జనరల్ చంపికా సయాల్ మాట్లాడుతూ ప్రణవి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. గోల్ఫ్‌లో సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్న ఐజీపీఎల్ నిర్వాహకులను అభినందిస్తున్నాం అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa