విప్రో సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ పేద నేపథ్యం నుంచి వచ్చే ఆడపిల్లలకు ఉన్నత విద్యను కొనసాగించేందుకు గొప్ప అవకాశం లభిస్తోంది. ఈ స్కాలర్షిప్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల కోసం రూపొందించారు. ఈ సంవత్సరం కూడా లక్షలాది మంది అమ్మాయిలు దీని ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న అమ్మాయిలకు ఈ స్కాలర్షిప్ పెద్ద ఊతమిస్తుంది. ఎంపికైన ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి రూ.30,000 నగదు సాయం అందుతుంది. ఇది చదువుకు అడ్డంకుల్ని తొలగించి కలల్ని నెరవేర్చుకునేందుకు బలమైన మద్దతు ఇస్తుంది.
అర్హత ఉన్న అమ్మాయిలు ఆన్లైన్లోనే సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, ఫారమ్ పూర్తి చేయడం ద్వారా ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ దరఖాస్తుకు ఆఖరి తేదీ నవంబర్ 23, 2025 (రేపే!). ఒక్క రోజు ఆలస్యం అయినా మీ అవకాశం చేజారిపోతుంది.
కాబట్టి గ్రామీణ పేద విద్యార్థినులు ఎవరైనా ఈ స్కాలర్షిప్ గురించి తెలుసుకుని, తమ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఒక్క అమ్మాయి చదువు కొనసాగడం వెనుక ఒక కుటుంబం భవిష్యత్తు మారొచ్చు. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. https://www.santoorscholarships.com/
త్వరపడండి.. రేపే లాస్ట్ డేట్!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa