ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న రాష్ట్ర శాసనసభ ఆవరణలో ఒక అద్భుత కార్యక్రమం జరగబోతోంది. ‘స్టూడెంట్ అసెంబ్లీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది విద్యార్థులు ఒక రోజు పూర్తిగా శాసనసభ్యులుగా మారబోతున్నారు. విద్యాశాఖ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైలురాయి కార్యక్రమంగా నిలవబోతోంది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసిన ఈ విద్యార్థుల్లో కొందరు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు త 175 మంది శాసనసభ్యులుగా తమ తమ నియోజకవర్గ సమస్యలను సభలో లేవనెత్తనున్నారు. ప్రశ్నోత్పత్తి, చర్చ, సూచనలు, తీర్మానాలు.. పూర్తిగా అసలు అసెంబ్లీ తరహాలోనే ఈ యువ సభ కొనసాగనుంది.
తమ నియోజకవర్గంలో రోడ్లు, నీరు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి స్థానిక సమస్యలతో పాటు రాష్ట్రాభివృద్ధికి కొత്ത ఆలోచనలు, సూచనలు చేయడానికి ఈ విద్యార్థులకు అవకాశం లభించనుంది. ఈ యువత దృష్టిలో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలనే ఆలోచనలు సభలో వినిపించబోతున్నాయి. రాజకీయ నాయకులకు ఇది కొత్త దృక్కోణాన్ని అందించే అవకాశం కూడా.
ఈ ప్రత్యేక స్టూడెంట్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రులు, శాసనసభ్యులు స్వయంగా వీక్షించి విద్యార్థుల స్ఫూర్తిని, ఆలోచనలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని ఇంతటి సార్థక కార్యక్రమంతో జరుపుకోవడం ద్వారా యువతలో పాలన, ప్రజాస్వామ్యం పట్ల అవగాహనను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa