టీమిండియా వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్న వేళ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ గంభీర్కు పూర్తి మద్దతు ప్రకటించింది. గంభీర్ కోచింగ్ బృందంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేసింది.ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, "సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది, హెడ్ కోచ్, ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. వారికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక్క ఓటమి రాగానే సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సరికాదు. అలాంటి వాటిని మేము పట్టించుకోము. ఇదే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, ఆసియా కప్లో అదరగొట్టింది, ఇంగ్లాండ్లో సిరీస్ సమం చేసింది" అని గుర్తు చేశారు.మరోవైపు, స్పిన్ పిచ్ వివాదంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కొటక్ కూడా గంభీర్ను వెనకేసుకొచ్చారు.క్యూరేటర్ను విమర్శల నుంచి కాపాడటానికే గంభీర్ పిచ్ నిందను తనపై వేసుకుని ఉండొచ్చు. ప్రతి జట్టూ స్వదేశంలో తమకు అనుకూలమైన పిచ్లపైనే ఆడుతుంది. మేం కూడా స్పిన్కు ప్రాధాన్యం ఇస్తాం అని ఆయన వివరించారు. బ్యాటర్ల వైఫల్యాన్ని కూడా కొటక్ ప్రస్తావిస్తూ అందరూ గంభీర్నే విమర్శిస్తున్నారు. మరి బ్యాటర్లు ఏం చేశారు ఈ విషయాన్ని ఎవరూ అడగడం లేదు. బహుశా కొందరికి వ్యక్తిగత అజెండాలు ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు.కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు విజయం సాధించింది. స్పిన్కు అనుకూలించే పిచ్ను తానే తయారు చేయమని అడిగానని గంభీర్ చెప్పడం, జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటం వంటి అంశాలు వివాదాన్ని మరింత పెంచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa