ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటకలో రోజురోజుకి పెరుగుతున్న ఆధిపత్య పోరు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 03:19 PM

కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న అంతర్గత పోరు మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డీకే శివకుమార్ వర్గం ఢిల్లీలో పాగా వేయగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం బెంగళూరులో ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది.సీఎం పదవి మార్పు కోసం ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా, డీకే శివకుమార్ మద్దతుదారులుగా ఉన్న 10 మందికి పైగా ఎమ్మెల్యేలు గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. త్వరలోనే మరో ఎమ్మెల్యేల బృందం కూడా ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన సిద్ధరామయ్య వర్గం, డీకే దూకుడుకు కళ్లెం వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అయిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇది డీకే శివకుమార్ ప్రాబల్యాన్ని తగ్గించే ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa