ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల పవిత్రతని పోగొడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 04:05 PM

తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం అపరాధమని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర అని టీటీడీ మాజీ చైర్మ‌న్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. మీడియా బాధ్యతగా వ్యవహరించి, తప్పుడు ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. తిరుమల లడ్డూలో 2019 నుండి 2024 వరకు నకిలీ నెయ్యి వాడారన్న వార్తలను  సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు నాణ్యత లేని నెయ్యితో తయారయ్యాయన్న వార్తలు తప్పుడు ప్రచారమే తప్ప నిజం కావన్నారు. ఈ మేర‌కు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుద‌ల చేశారు. లడ్డూ విషయం పై జరుగుతున్న SIT విచారణకు పూర్తిగా సహకరించామని, విచారణకు ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. "శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని, కానీ మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa