ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులు ఊబిలో చిక్కుకున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 04:09 PM

కూటమి ప్రభుత్వ పాలన రైతులను కష్టాల్లోకి నెట్టిందని, కనీసం పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం  ఉందని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. పండించిన పంటలను కొనే నాథుడే లేదంటూ రైతుల ఆందోళన చెందుతున్నారని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులు నుంచి మొక్కజొన్న, కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో అరటి తోటలను, రోడ్డుపై ఆరబోసుకున్న మొక్కజొన్న, కందులను పార్టీ నాయకులు, రైతులతో కలిసి తలారి రంగయ్య  పరిశీలించారు. ఈ సందర్బంగా తలారి రంగయ్య మాట్లాడుతూ...అనంతపురం జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని  ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు రైతులు పెట్టుబడులు పెట్టి, సకాలంలో రైతులకు గిట్టుబాటు ధర  రాక రైతుల అప్పులు ఊబిలో చిక్కుకున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కనీస మద్దతు ధరకే పంటను కొనుగోలు చేసే విధంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.  కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడగట్ట నారాయణ, ఎంపీపీ మారుతమ్మ ఆంజనేయులు, జడ్పీటీసీ బొమ్మయ్య, సర్పంచ్ శోభారాణి స్థానిక రైతులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa