ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 04:11 PM

టీటీడీ నెయ్యి కేసులో వస్తున్న ఆరోపణలని వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దీటుగా తిప్పికొట్టారు. టీటీడీ చైర్మన్ హోదాలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని పూర్తి వివరాలతో వెల్లడించారు. నెయ్యి కాంట్రాక్టుల్లో, ఇతర కాంట్రాక్టుల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జర గలేదని ఆయన తేల్చి చెప్పారు. కిలో నెయ్యి రూ.351తో కొనుగోలు చేస్తే నాసిరమైన నెయ్యి సరఫరా చేశారని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గగ్గోలు పెడుతోందని, గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కిలో నెయ్యి కేవలం రూ.276 చొప్పున కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి అప్పుడు నాసిరకమైన నెయ్యి సరఫరా చేశారని సీఎం చంద్రబాబు అంగీ కరిస్తారా? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa