ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 04:12 PM

కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు అన్నదాతల మీద పగబట్టినట్టు వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశాడని ఆక్షేపించారు. నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని.. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఏ పంటకూ లేని మద్ధతు ధర లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామన్న ఆయన... అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు చేయూతనిచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని అందించడంతో పాటు, ఇ-క్రాప్, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa