ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 04:13 PM

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై, ముఖ్యంగా అభివృద్ధి–సంక్షేమ అంశాలపై పవన్ కళ్యాణ్ నోరు మెదపక‌పోవ‌డం పట్ల ఆయన మండిపడ్డారు. శ‌నివారం విశాఖ‌లో వాసుప‌ల్లి గ‌ణేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ప్రజల కోసం మాట్లాడాల్సిన నేతగా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాల్సింది పోయి, సినిమాల మాదిరిగా రాజకీయాలను నడిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అనే బాధ్యతకు ఆయన ప్రవర్తన ఏమాత్రం సరిపోదు.” అని వ్యాఖ్యానించారు.“ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవరత్న ప్రాజెక్టుల ద్వారా స్థాపించిన అనేక మెడికల్ కాలేజీలను నేడు అక్కడి బీజేపీ ప్రభుత్వం వికసింపజేస్తోందని పేర్కొన్నారు. “మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలను కొనసాగించడంలో ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది?” అని గణేష్ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa