ఇద్దరు యువకులు ఒకే యువతిని ప్రేమించారు. కొంతకాలంగా ఆమె కోసం ఇద్దరి మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఈ వివాదానికి పుల్స్టాప్ పెట్టాలని ఆ యువతి భావించింది. ఇద్దరిని ఒకచోటకి రమ్మని చెప్పింది.. మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఇద్దరు యువకులు వెళ్లారు.. కానీ అక్కడ పరిస్థితి రివర్స్ అయ్యింది. ఇద్దరు యువకులు ఆమె సమక్షంలోనే మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటన కలకలం హాట్టాపిక్ అయ్యింది.
విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన చైతన్య, విశాఖపట్నానికి చెందిన సూర్య కార్తికేయన్ ప్రేమిస్తున్నారు. సిరిపురం ప్రాంతంలోని ఒక హోటల్లో యువతి ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా ఆమె కోసం చైతన్య, కార్తికేయన్ తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో ఆ యువతి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు.. ఈ సమస్యను పరిష్కరించడానికి, యువతి వారిద్దరినీ సిరిపురం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ దగ్గరకు రమ్మని చెప్పింది. ఆ ఇద్దరు ఆమె చెప్పిన చోటకు వెళ్లారు.. ముగ్గురు అతిథి గృహం దగ్గరు కలిశారు. వారి మధ్య సయోధ్య కుదరలేదు. బదులుగా, ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు.
చైతన్య కత్తితో కార్తికేయన్పై దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఈ తోపులాటలో సూర్య కార్తికేయన్కు మోచేయి, మణికట్టు వద్ద గాయాలు అయ్యాయి. భయపడిపోయిన యువతి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే త్రీటౌన్ పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.. కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘర్షణలో గాయపడిన కార్తీకేయన్ది తమిళనాడు కాగా.. కుటుంబంతో కలిసి విశాఖపట్నం సిరిపురంలో నివాసం ఉంటున్నాడు. కార్తికేయన్ బీటెక్ పూర్తి చేసి గేట్ కోసం చదువుతున్నాడు. ఇక మరో యువకుడు చైతన్య డిగ్రీ పూర్తి చేశాడు. మొత్తం మీద ఒకే యువతి కోసం ఇద్దరు ఘర్షణకు దిగడం చర్చనీయాంశమైంది. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను మనం చూస్తుంటాం.. అయితే గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి తరహా ఘటనలే జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa