భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. గువహటి వేదికగా శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పర్యాటక ప్రొటీస్ జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఆ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా కనీసం 35కి పైగా రన్స్ స్కోరు చేశారు. ఇక, భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా.. ఏమాత్రం సంకోచం లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆ జట్టు ఓపెనర్లు అదరగొట్టారు. తొలి వికెట్కు 82 పరుగులు జోడించారు. 38 పరుగులు చేసిన తర్వాత మార్క్రమ్ ఔట్ అయ్యాడు. దీంతో 82/1తో దక్షిణాఫ్రికా తొలి సెషన్ను ముగించింది. అనంతరం బ్రేక్ తర్వాత మరుసటి ఓవర్లోనే ర్యాన్ రికల్టన్ (35)ను కుల్దీప్ బుట్టలో వేసుకున్నాడు.
తొలి సెషన్ ముగిసిన కాసేపటికే వికెట్ పడగొట్టిన భారత బౌలర్లు.. ఆ తర్వాత తేలిపోయారు. ఆ సెషన్ మొత్తం దక్షిణాఫ్రికా మరో వికెట్ ఇవ్వలేదు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఆ జట్టు 156/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ చివరి సెషన్లో భారత బౌలర్లు కమ్బ్యాక్ ఇచ్చారు. నాలుగు వికెట్లు తీశారు. దీంతో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగులతో తొలి రోజు ఆటను ముగించింది. తొలి రోజు ఆటలో ఆధిపత్యం చలాయించింది.
భారత బౌలర్లలో బుమ్రా 17 ఓవర్లు వేసినా.. ఒకే ఒక్క వికెట్ తీశాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. 14 ఓవర్లు వేసిన వాషింగ్టన్ సుందర్, నాలుగు ఓవర్లు వేసిన నితీశ్ కుమార్ రెడ్డి వికెట్ తీయలేకపోయారు. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకోగా.. ఈ రోజు ఆట చివరి ఓవర్లో సిరాజ్ వికెట్ పడగొట్టాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa