ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటి కాయలకు కేజీ రూ.1... రాయలసీమ రైతు కన్నీటి గాథ!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 12:58 PM

రాయలసీమ జిల్లాల్లో అర4టి సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది తీవ్రమైన ఆర్థిక నష్టంతో కొట్టుమిట్టాడుతున్నారు. మూడేళ్ల క్రితం ఒక టన్ను అరటికి రూ.25 వేల వరకు ధర పలికితే, ఈసారి అదే పరిమాణం రూ.1,000 కూడా దాటకుండా పడిపోయింది. పంట పండినా ఖర్చులు కూడా రాకపోవడంతో చాలా మంది రైతులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పొలంలోనే అరటి తోటలు నరికివేస్తున్న దృశ్యాలు సామాన్యమైపోయాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో అరటి కేజీ ధర రూ.1 నుంచి రూ.1.50 మధ్యలోనే ఉంది. ఒక కేజీలో సగటున ఆరు నుంచి ఏడు అరటికాయలు ఉంటాయి. అంటే రెండు కేజీలు (ఒక డజను) కాయలకు రైతుకు వచ్చే మొత్తం రూ.2 నుంచి రూ.3 మాత్రమే. ఇది కూడా మధ్యవర్తులు, ఏజెంట్లు తీసివేసిన తర్వాత రైతు చేతికి వచ్చే మిగిలిన డబ్బు.
మరోవైపు బయటి రిటైల్ మార్కెట్లలో అదే డజను అరటికాయలు రూ.40 నుంచి రూ.60 వరకు అమ్ముడవుతున్నాయి. రైతుకు రెండు రూపాయలు వచ్చే చోను వినియోగదారుడి వద్దకు చేరేసరికి 20–30 రెట్లు ధర పెరుగుతోంది. ఈ భారీ తేడా మధ్యలోని వ్యాపారులు, మధ్యవర్తుల జేబుల్లో పడుతోంది. రైతు–వినియోగదారుడి మధ్య ఉన్న ఈ దోపిడీ వలయం ఇప్పటికే రాయలసీమ రైతులను నిర్వీర్యం చేస్తోంది.
సమస్య ఎక్కడ ఉందంటే... సరైన మార్కెట్ లింకేజీ లేకపోవడం, రైతు సంఘాలు బలహీనంగా ఉండటం, ఎగుమతి అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోవడం, అతిగా ఉత్పత్తి కావడం వలన సరఫరా పెరగడం – ఇవన్నీ కలిసి ధరలను కిందకు నెట్టాయి. ఈ పరిస్థితుల్లో రైతులు మళ్లీ అరటి సాగు చేయాలనే ధైర్యం కోల్పోతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర ప్రకటించి, నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యవస్థ తీసుకొస్తేనే ఈ సంక్షోభం నుంచి బయటపడగలరు. లేకపోతే రాయలసీమ అరటి తోటలు శాశ్వతంగా చరిత్రలోనే మిగిలిపోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa