కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వీటిల్లో భాగంగా పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం బైపాస్లు కూడా నిర్మిస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా బైపాస్లు నిర్మిస్తున్నారు. ఈక్రమంలో దాచేపల్లి-మాచర్ల నేషనల్ హైవే 167AD మార్గంలో ఉన్న గురజాల, మాచర్ల, రెంటచింతల వంటి పట్టణాల్లో ఉన్న రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. దీనికోసం రెంటచింతల, మాచర్ల, గురజాల పట్టణాల్లో రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి జాతీయ రహదారుల సంస్థ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది.త్వరలోనే ఈ రూట్లలో పనులు ప్రారంభించనున్నారు. 9 నెలల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
దీనిలో భాగంగా ఆయా పట్టణాల నుంచి బైపాస్ను కలిపే మార్గాలను కూడా విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు. దీని వల్ల వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యంగా సాగనుంది. పల్నాడు జిల్లాలో నకిరేకల్-ఏర్పేడు, అద్దంకి-నార్కట్పల్లి రూట్లను అనుసంధానం చేసే 167ఏడీ జాతీయ రహదారిని అభివృద్ధి చేయడంతో రవాణా అవకాశాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్ారు. దాచేపల్లి-మాచర్ల జాతీయ రహదారి 167AD మార్గంలో మాచర్ల, గురజాల, రెంటచింతల పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాల వెంబడి ప్రస్తుతం ఉన్న మార్గం వెళ్తుండగా.. ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మూడు పట్టనాలకు బైపాస్లు నిర్మించారు.అలానే పట్టణాల్లో రోడ్లు విస్తరించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్లు నిర్మించబోతున్నారు. దీని కోసం రూ.50 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలానే మాచర్లలో 4.9 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న మార్గాన్ని.. ఇరువైపులా 10 అడుగుల మేర విస్తరించడమే కాక.. దానికి రెండువైపులా డ్రెయిన్లు నిర్మించబోతున్నారు.
అలానే రెంటచింతలలో 4 కిలోమీటర్ల మార్గాన్ని ఇరువైపులా 15 అడుగుల మేర విస్తరించబోతున్నారు. ఈక్రమంలో అవసరమైనచోట 500 మీ. దూరం డ్రెయిన్ నిర్మించబోతున్నారు. అలానే ఇప్పుడు గురజాలలో 4 వరుసల రోడ్డు ఉంది. ఈ మార్గాన్ని 4.2 కిలోమీటర్ల మేర రెండు వైపులా 10 అడుగుల మేర విస్తరించబోతున్నారు. అలానే ఈ మార్గంలో అవసరమైన ప్రాంతాల్లో డ్రెయిన్ నిర్మిస్తారు. ఈ అభివృద్ధి పనులతో పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న మార్గాల రూపు రేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్టర్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మరో నెలరోజుల్లో పనులు ప్రారంభించనున్నారు. అలానే తొమ్మిది నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తామని జాతీయ రహదారుల ఇంజినీరు ఒకరు తెలిపారు. దీంతో బైపాస్ వెళ్లే పట్టణాల రూపు రేఖలు మారబోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa