అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా అమరావతి రైల్వే లైన్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు , అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, అమరావతి క్రికెట్ స్టేడియం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) విషయంలో కీలకమైన అడుగు పడింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిల్లాలలోని 23 మండలాల పరిధిలోని 97 గ్రామాల మీదుగా వెళ్లేలాఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డును డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల నుంచి అధికారులు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 3ఏ ప్రతిపాదనలు జాతీయ రహదారుల అధికారుల వద్దకు చేరాయి. అలాగే రేపటి కల్లా (సోమవారం) కృష్ణా జిల్లా నుంచి ప్రతిపాదనలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని దశలు పూర్తి అయితే.. భూసేకరణ మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.మరోవైపు 190 కిలోమీటర్ల పొడవుతో అమరావతి రాజధాని చుట్టూ ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రణాళికలు రచించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు డీపీఆర్ సైతం ఇప్పటికే ఢిల్లీలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వద్దకు చేరింది. 97 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మైలవరం, కంచికచర్ల,, జి.కొండూరు, వీరులపాడు మండలాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తోంది. ఈ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ నిర్మాణంపై ఇప్పటికే ఆరు గ్రామాల ప్రతిపాదనలు అధికారులకు చేరాయి.
అయితే ప్రతిపాదనల్లో కొన్ని లోపాలు ఉన్నాయనే కారణంతో NH అధికారులు వెనక్కి పంపారు. దీంతో రెవెన్యూ అధికారులు వాటిని సరిచేసి, మరికొన్ని గ్రామాల ప్రతిపాదనలను చేర్చి 3ఏ ప్రతిపాదనలు NH అధికారులకు పంపించారు. భూమి వివరాలు, సర్వే నంబరులో ఎంత ఉంది.. రహదారి నిర్మాణం కోసం ఎంత భూమిని తీసుకుంటున్నారనే వివరాలు అందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను జాతీయ రహదారుల సంస్థ అధికారులు పోర్టల్లో నమోదు చేస్తారు. అనంతరం దిల్లీలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కార్యాలయానికి.. రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ అధికారులకు పంపిస్తారు.
మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఐదు జిల్లాల పరిధిలో నిర్మిస్తున్నారు. ఏలూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ఇప్పటికే ఢిల్లీలో ఆమోదం లభించింది. గుంటూరు, పల్నాడు ప్రతిపాదనలు ఢిల్లీ కార్యాలయానికి చేరాయి. మరో వారం పది రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల ప్రతిపాదనలు కూడా ఢిల్లీకి పంపిస్తారు.అక్కడి నుంచి ఆమోదం రాగానే...అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ చేపడతారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 190 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసలుగా నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రాజెక్ట్ వ్యయం రూ.24,791 కోట్లుగా అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa