ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూంబింగ్ నిలిపిస్తే ఆయుధాలు వదిలేస్తాం: మావోయిస్టుల షరతు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 03:16 PM

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ (MMC) రాష్ట్రాల్లో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేస్తే, తాము ఆయుధాలు విడిచిపెట్టే తేదీని ప్రకటిస్తామని మావోయిస్టులు ప్రకటించారు. MMC స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరుతో విడుదలైన లేఖలో ఈ విధంగా ప్రకటించారు. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని, దీనికి ఫిబ్రవరి 15 వరకు గడువు కావాలని 3 రాష్ట్రాల ప్రభుత్వాలను మావోయిస్టులు కోరారు. ప్రతిగా, పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోమని, తమ కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa