టీడీపీ కూటమి ఏడాదిన్నర పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైందని, సీఎం చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు రైతన్న కన్నీరు పెట్టని రోజే లేదని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందే కాకుండా రైతన్నా మీకోసం.. పంచసూత్రాలు తీసుకొచ్చానని చెప్పినంత మాత్రాన చంద్రబాబుని ఎలా నమ్ముతారని రాయచోటిలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నించారు. అధికారులు, కూటమి ఎమ్మెల్యేల కాలర్ పట్టుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం చూస్తే ఆయన ఎప్పుడు సీఎంగా చేసినా ఆ కాలమంతా రైతుల పాలిట శాపంగా మారుతోందని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో వ్యవసాయం పండగలా సాగితే చంద్రబాబు సీఎం అయ్యాక దండగలా మార్చేశాడని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. రైతుల పక్షాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మాట్లాడినప్పుడల్లా మొక్కుబడిగా కేంద్రానికి లేఖలు రాసేసి చేతులు దులిపేసుకోవడం తప్ప, రైతులకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. మామిడి రైతులకు ప్రభుత్వం తరఫున ప్రతి కిలోకు రూ.4 చొప్పున ఎంత మందికి చెల్లించారో వివరాలు వెల్లడించాలని కోరారు. మంగళవారం నాడు జగన్గారు, పులివెందులలో పర్యటించి, ఇటీవలి వర్షాలకు నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారని జి.శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa