భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచంలోనే సుదీర్ఘంగా జరిగిన సాంస్కృతిక వేడుకలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్.100 దేశాలను ఒక వేదికపైకి తెచ్చి, కళలు, సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు, సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని ఏకం చేయడం ద్వారా భగవాన్ సత్యసాయి బాబాకు ఘన నివాళి అర్పించింది వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్. ఈ ఉత్సవంలో 100 మంది మానవతావాదులను, 140కి పైగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేట్ సంస్థలను, 45కి పైగా గ్లోబల్ థాట్ లీడర్లను, అలాగే మీడియా, జర్నలిజం, న్యాయవాద రంగాల్లోని అనేకమంది ప్రతిభావంతులను సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa